పక్కాగా ఓటర్ల జాబితా | Sakshi
Sakshi News home page

పక్కాగా ఓటర్ల జాబితా

Published Sat, Nov 11 2023 12:36 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న 
కలెక్టర్‌ నాగలక్ష్మి, జేసీ మయూర్‌ అశోక్‌ - Sakshi

విజయనగరం అర్బన్‌: ఎటువంటి తప్పులు లేకుండా అత్యంత పకడ్బందీగా ఓటర్ల జాబితాను రూపొందించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఈ మేరకు ఆర్డీఓలు, వివిధ మండలాల తహసీల్దార్లతో శుక్రవారం ఆమె కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాలు, మండలాల వారీగా ఓటర్ల జాబితా సవరణపై సమీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ 31వ తేదీ వరకు వచ్చిన క్టెయిమ్‌లు మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. వెంటవెంటనే కంప్యూటర్‌లో ఆన్‌లైన్‌ చేయాలని సూచించారు. ఒకే డోర్‌ నంబర్‌తో ఉన్న ఓట్లు, ఒకే ఇంట్లో పదికిపైగా ఉన్న ఓట్లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి, విచారణ చేయాలని సూచించారు. పైపోర్షన్‌, ప్రక్కపోర్షన్‌లో ఉంటున్న వారికి వేరే డోర్‌ నంబర్‌ కేటాయించాలని చెప్పారు. ఓటు తొలగించే ముంద తప్పనిసరిగా నోటీసు ఇవ్వాలని స్పష్టం చేశారు. యువ ఓటర్లపై దృష్టి పెట్టాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ మయూర్‌ అశోక్‌, ఆర్‌డీఓ అనిత, నియోజకవర్గ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ నాగలక్ష్మి

Advertisement
Advertisement