ఆటోను ఢీకొన్న లారీ

26 Mar, 2023 02:10 IST|Sakshi
సుబ్బమ్మ (ఫైల్‌)

బద్వేలు అర్బన్‌ : బద్వేలు – మైదుకూరు రహదారిలోని చెన్నంపల్లె, తొట్టిగారిపల్లె గ్రామాల మధ్యలో శనివారం ఆటోను లారీ ఢీకొనడంతో.. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరులోని ద్వారకనగర్‌కు చెందిన తుపాకుల సుబ్బమ్మ (52) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుండేది. బద్వేలులోని కుమ్మరికొట్టాలులో ఈమె సమీప బంధువు సరోజనమ్మ శుక్రవారం మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చింది. శనివారం అంత్యక్రియలు ముగించుకుని ప్రొద్దుటూరుకు వెళ్లేందుకు తన కుమార్తె, అల్లుడు, కుమారుడుతో బస్సు కోసం వేచి ఉండగా.. ప్రొద్దుటూరు వైపు వెళుతున్న ఓ ఆటో రావడంతో అందులో ఎక్కారు. చెన్నంపల్లె దాటిన కొద్దిసేపటికి బద్వేలు వైపు వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో ముందు భాగంలో కూర్చొన్న సుబ్బమ్మ చేయి తెగిపడి తీవ్ర గాయాలపాలైంది. అలాగే అప్పటికే ఆటోలో ఉన్న మైదుకూరు పట్టణంలోని కొత్తకొట్టాలుకు చెందిన షేక్‌ అబ్దుల్‌ జబ్బార్‌ (63)కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఇరువురిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే సుబ్బమ్మ మృతి చెంది ఉంది. తీవ్ర గాయాలపాలైన అబ్దుల్‌జబ్బార్‌ను మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు. ఘటనా స్థలాన్ని అర్బన్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ కత్తివెంకటరమణ పరిశీలించి ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్‌కు తరలించారు. మృతురాలి కుమార్తె అనూష ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్‌ ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

ఒకరి మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

మరిన్ని వార్తలు