ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు మహా పాదయాత్ర | Sakshi
Sakshi News home page

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు మహా పాదయాత్ర

Published Sun, Nov 19 2023 1:46 AM

పాదయాత్రలో పాల్గొంటున్న వారికి స్వాగతం పలుకుతున్న 
ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి - Sakshi

వేంపల్లె/వీరపునాయునిపల్లె : రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎంగా కావాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు పేర్కొన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఆయన శుక్రవారం ప్రారంభించిన మహా పాదయాత్ర శనివారం వేంపల్లె, వీరపునాయునిపల్లె మీదుగా సాగింది. ఆయనకు సంఘీభావంగా వేంపల్లె సర్పంచ్‌, జేసీఎస్‌ మండల కన్వీనర్‌ ఆర్‌.శ్రీనివాసులు పాదయాత్రగా నడిచారు. కాగా, పాదయాత్ర చేస్తున్నవారికి వీరపునాయునిపల్లెలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర మైనింగ్‌ డైరెక్టర్‌ వీరప్రతాప్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికి అభినందించారు.

మళ్లీ సీఎంగా జగనే కావాలంటున్న రాష్ట్ర ఎస్సీ కమిషన్‌

మాజీ సభ్యుడు బసవరావు

Advertisement
Advertisement