21న డీసీసీ బ్యాంక్‌ క్రెడిట్‌ క్యాంపు నిర్వహణ | Sakshi
Sakshi News home page

21న డీసీసీ బ్యాంక్‌ క్రెడిట్‌ క్యాంపు నిర్వహణ

Published Sun, Nov 19 2023 1:46 AM

డీసీసీ బ్యాంకు సీఈఓ 
కందుల రాజేంద్రకుమార్‌ - Sakshi

కడప అగ్రికల్చర్‌ : కడప డీసీసీ బ్యాంకు ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఆవరణంలో క్రెడిట్‌ క్యాంపును నిర్వహించి భూమి, ఇళ్లు తనఖాపై తిరిగి రుణం చెల్లించగల సామర్థ్యం ఉన్న వారికి రూ.35 లక్షల వరకు రుణాలను మంజూరు చేయడం జరుగుతుందని కడప డీసీసీ బ్యాంకు సీఈఓ కందుల రాజేంద్రకుమార్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన కడప డీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఆస్తిని తనఖాగా పెట్టుకుని ఖాతాదారుల అవసరం మేరకు పిల్లల చదువుకోసం, పిల్లల పెళ్లిళ్లు, ఆస్తి కొనుగోలు, ఇంటి మరమ్మతులు, వ్యాపారం లాంటి వాటి కోసం రూ.35 లక్షల వరకు రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అలాగే గడప గడపకు కడప బ్యాంకు నినాదంతో ప్రతి ఇంటికి కడప బ్యాంకును పరిచయం చేయడంలో భాగంగా వచ్చే ఏడాది జవనరి 30వ తేదీ వరకు పొదుపు, కరెంట్‌ ఖాతాలను రూ.100 ఓపెన్‌ చేయడం జరుగుతుందన్నారు. ఖాతాలను ఓపెన్‌ చేసిన వారికి ఉచితంగా 2 లక్షల సురక్ష బీమా యోజనతోపాటు ఉచితంగా రూపే కార్డును కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. దీంతోపాటు పుట్టిన బిడ్డ నుంచి 15 ఏళ్లలోపు పిల్లలందరికీ రూ.100 లకే కిడ్డీ సేవింగ్స్‌ ఖాతా తెరిచి డబ్బులను దాచుకునేందుకు బాక్స్‌ను కూడా ఉచితంగా ఇస్తామని వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement