గుంతకల్లులో టీడీపీ నేతల దాష్టీకం

10 Jan, 2018 12:11 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఐఓసీ బంద్‌

సాక్షి, గుంతకల్లు‌: అనంతపురం జిల్లా గుంతకల్లులో తెలుగుదేశం పార్టీ నేతలు విధ్వంసం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నేతలకు చెందిన ఏడు ఆయిల్‌ ట్యాంకర్ల లారీలను ధ్వంసంచేయడమే కాక, అడ్డు వచ్చినవారిపై దాడికి దిగారు. ఇంధన సరఫరాలో అధిపత్యం కోసం అధికార పార్టీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. టీడీపీ నేతల దాష్టీకానికి నిరసనగా బుధవారం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) గుంతకల్‌ డిపో బంద్‌కు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి పిలుపు ఇచ్చారు. 

మరిన్ని వార్తలు