నవోదయ నుంచి 14 మంది విద్యార్థులు అదృశ్యం!

14 Mar, 2015 15:13 IST|Sakshi

పెదవేగి : పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలోని జవహర్ నవోదయ విద్యాలయం నుంచి హర్యానా రాష్ట్రానికి చెందిన 14 మంది విద్యార్థులు అదృశ్యమయ్యారు. వీరంతా 9వ తరగతి చదువుతున్నారు.

తమకు బీచ్ చూడాలని ఉందని తోటి విద్యార్థులతో చెప్పి శనివారం ఉదయం 9 గంటలకు విద్యాలయం వసతి గృహం నుంచి 14 మంది విద్యార్థులు బయటకు వెళ్లారు. విద్యాలయం ప్రిన్సిపాల్‌కు గానీ, సిబ్బందికి గానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మధ్యాహ్నం వరకు ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు