ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల పదోన్నతుల గందరగోళం

30 Jun, 2019 17:48 IST|Sakshi

కృష్ణా : రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల పదోన్నతుల విషయంలో గందరగోళం నెలకొంది. ప్రమోషన్ల విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవంగా 20 నుంచి 30 ఏళ్ల లోపు సర్వీస్‌ ఉన్నవారికి పదోన్నతులు ఇవ్వాలని నిబంధన ఉన్నప్పటికీ .. ఆధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. రోస్టర్‌ పేరుతో తక్కువ కాలం సర్వీస్‌ ఉన్నా.. పలువురికి ప్రమోషన్లు ఇస్తున్నారని అధికారులను విమర్శించారు. 610 జీవో పరిధిలోకి వచ్చే వారికి సరిపడ పదోన్నతులు వర్తింపచేయాలన్నారు. ప్రమోషన్ల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టకపోతే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్టు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు