యూట్యూబ్‌లో చూసి ప్రాణాల మీదకు..

7 Apr, 2020 13:58 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : జిల్లాలోని  బైరెడ్డిపల్లి మండల కేంద్రం గడ్డురు పంచాయితి ఆలపల్లి గ్రామంలో రెండు కుటుంబాలు యూట్యూబ్లో చూసి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. నల్ల ఉమ్మసి చెట్టులో ఉన్న కాయలను నీళ్లలో వేసి తాగితే కరోనా పోతున్నది అని గుడ్డిగా నమ్మి 8 మంది దాన్ని సేవించారు. దీంతో వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇది  గమనించిన గ్రామస్థులు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. అనంతరం ఎనిమిది మందిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. వారి పేర్లు: లక్షమ్మ(40), సుధాకర్ (20), గీత(20), భవాని(20), వెంకటేష్(9),  హేమంత్(6), వీరమ్మ(70), నాగరాజు (70)..

కరోనాపై పోరాటం: సూపర్‌ స్టార్ల షార్ట్‌ఫిల్మ్‌

మరిన్ని వార్తలు