నెల్లూరు: ఇళ్లల్లో చోరీలు, మహిళ మెడల్లోని గొలుసులను అపహరిస్తున్న దొంగల ముఠాను నెల్లూరు నగర పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గజరావు భూపాల్ వివరాలు తెలిపారు. జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. .వారిని షామీర్, మున్న, మస్తాన్, నాయబ్ రసూల్ గా గుర్తించారు. వారి నుంచి రూ.9.85 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.