పల్టీ కొట్టిన సైకిల్

13 Mar, 2014 03:53 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఉద్యవుంలో ఉనికిని కోల్పోరుున తెలుగుదేశం పార్టీ... బీజేపీతో పొత్తు కూడింది. హుజూరాబాద్‌లో వూజీ వుంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రెండు పార్టీల వుధ్య పొత్తు ఖరారైన విషయూన్ని ధ్రువీకరించారు. వుున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎక్కడికక్కడే స్థానిక నాయుకులు సీట్లను సర్దుబాటు చేసుకుంటున్నట్లు  ప్రకటించారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలో పెద్దిరెడ్డి నివాసంలో రెండు పార్టీల వుుఖ్య నేతలు భేటీ అయ్యూరు.
 
 సీట్ల పంపకాలపై చర్చలు జరిపారు. వుున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న రెండు కార్పొరేషన్లు, తొమ్మిది పట్టణాల్లోని డివిజన్లు, వార్డు స్థానాల్లో ఎవరెక్కడ గెలిచే అవకాశవుుంటే.. వారిని బరిలోకి దింపాలని ఒప్పందం చేసుకున్నారు. స్థానికంగా అక్కడి నేతలు పరస్పర అవగాహనతో బీ ఫారాలు ఇచ్చుకోవాలని నిర్ణరుుంచుకున్నారు.
 
 దీంతో వారం రోజుల నుంచి లోపారుుకారిగా జరుగుతున్న పొత్తుల కసరత్తు బహిరంగమైంది. వరుసగా ఎన్నికలు రావడంతో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలతోపాటు పట్టణాలు, పల్లెల్లోనూ టీడీపీకి అభ్యర్థులు కరువయ్యూరు. పరువు కాపాడుకోవటమే పార్టీకి పెద్ద సవుస్యగా వూరింది. అందుకే బీజేపీతో పొత్తు కూడితే వీలైనన్ని స్థానాల్లో పోటీచేసినట్లు చెప్పుకోవచ్చని టీడీపీ నేతలు ఆరాటపడుతున్నారు. జిల్లా నుంచి ఆ పార్టీ తరపున వుుగ్గురు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కానీ.. కేడర్ చెల్లాచెదురవటంతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కుదేలైంది. వుుగ్గురు ఎమ్మెల్యేలకు సొంత సెగ్మెంట్లలో పార్టీ జెండాలు ఎగరేయులేని గడ్డు కాలం ఎదురైంది. చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యు పార్టీని ఏ క్షణంలోనైనా వీడి వెళ్లేందుకు దిక్కులు చూస్తున్నారు.
 
 జిల్లా కేంద్రంలో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే, ఎంపీ సీటుకు పోటీ చేసేందుకు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న రావుగుండం నియోజకవర్గంలోనూ అభ్యర్థులు లేరు. మొన్నటివరకు అక్కడ ఇన్‌చార్జీగా ఉన్న పెద్దిరెడ్డి... ఒక్కసారిగా హుజురాబాద్ వైపు రూటు వూర్చారు. దీంతో రావుగుండంలో పార్టీ ఖాళీ అరుుంది. అక్కడున్న గోపు అరుులయ్యుయూదవ్ ఇటీవలే పార్టీకి రాజీనావూ చేశారు. తనను కాదని పెద్దిరెడ్డికి బాధ్యతలు అప్పగించటంతో ఆయున దూరవుయ్యూరు. హుజూరాబాద్‌లో వుుద్దసాని కశ్యప్‌రెడ్డి సైతం అసంతృప్తితో ఉన్నారు.
 
 మిగతా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలుగా ఉన్న వారే పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. వుంథనిలో కర్రు నాగయ్యు ఇప్పటికే ప్రచార పాదయూత్ర ప్రారంభించారు. కోరుట్లలో సాంబారి ప్రభాకర్, హుస్నాబాద్‌లో పేర్యాల రవీందర్‌రావు, వూనకొండూరులో కవ్వంపల్లి సత్యనారాయుణ, వేవుులవాడలో చెన్నాడి సుధాకర్‌రావు, ఎన్‌ఆర్‌ఐ పుట్ట కిశోర్ సిరిసిల్లలో పోటీ చేసే అవకాశాలున్నారుు. ఈ వుుగ్గురూ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారే. పెద్దపల్లి ఎంపీ సీటుకు సైతం అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఆ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన సుగుణకువూరి ఇటీవలే బీజేపీలో చేరారు. అందుకే పాత దోస్తీ తవుకు కలిసొస్తుందని తవుు్మళ్లు ఆశ పడుతున్నారు. నరేంద్రమోడీ హవాతోపాటు పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు వుద్దతు ఇచ్చింది తామేనని ఉత్సాహంగా ఉన్న బీజేపీ శ్రేణులు జిల్లాలో పునర్‌వైభవానికి తహతహలాడుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ లేకపోవటంతో ఇష్టవుున్నా.. లేకున్నా.. పొత్తు కూడటమే సరైందని బీజేపీ నేతలు సర్దుకుంటున్నారు. పునర్విభజనకు వుుందు టీడీపీ పొత్తుతోనే కరీంనగర్ ఎంపీ సీటును, పెద్దపల్లి, మెట్‌పల్లి అసెంబ్లీ స్థానాలను బీజేపీ అభ్యర్థులు గెలుచుకున్నారు.
 
 ఉద్యవు ప్రభావంతో టీడీపీ ఖాళీ అరుునప్పటికీ.. జిల్లాలో విస్తరించేందుకు పొత్తు కలిసి వస్తుందని బీజేపీనేతలు అభిప్రాయుపడుతున్నారు. కరీంనగర్‌లో ఎంపీ సీటుకు పోటీ చేయూలని ఆపార్టీ తరఫున వుురళీధర్‌రావు, వూజీ వుంత్రి విద్యాసాగర్‌రావు పోటీ పడుతూనే ఉన్నారు. కరీంనగర్ నుంచి డాక్టర్ విజయేందర్‌రెడ్డి, బండి సంజయ్ అసెంబ్లీ సీటు కోరుతున్నారు.
 
 గుజ్జుల రావుకృష్ణారెడ్డి, సుగుణాకర్‌రావు, లింగంపల్లి శంకర్, బల్మూరివనిత, గడ్డం నాగరాజు, ప్రతాప రావుకృష్ణ, ఇటీవల పార్టీలో చేరిన సుగుణాకువూరి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. అన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలు ఉన్నప్పటికీ.. పొత్తు లేకపోతే గత ఎన్నికల తరహాలోనే అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి బీజేపీని సైతం వెంటాడుతోంది. అందుకే పాత దోస్తీతో.. జట్టు కడితే అభ్యర్థుల గాలింపు గండం నుంచి గట్టెక్కే వీలుందనే రెండు పార్టీలు విశ్వసిస్తున్నారుు.
 

మరిన్ని వార్తలు