న్యూఢిల్లీ : అత్యంత ధనికవంతుల్లో ఒకరైన సెలబ్రిటీ జువెల్లరీ నిరవ్ మోదీపై కేసు నమోదైంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి రూ.280 కోట్ల చీటింగ్ కేసులో భాగంగా ఆయనపై సీబీఐ అభియోగాలు మోపినట్టు అధికారులు తెలిపారు. నిరవ్ మోడీ ఆభరణాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఆయన రూపొందించిన ఆభరణాలతో పలువురు ప్రముఖ సెలబ్రిటీలు పలు వేదికలపై కనువిందు చేశారు కూడా.