త్వరలో రూ.50 నోటు కొత్త సిరీస్‌ 

17 Apr, 2019 00:40 IST|Sakshi

ముంబై: త్వరలోనే రూ.50 నోటు నూతన సిరీస్‌ చలామణిలోకి రానుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకంతో మహాత్మా గాంధీ బొమ్మ ఉండే కొత్త సిరీస్‌ త్వరలోనే చలామణిలోకి రానుందని, ఈ సిరీస్‌తో పాటు పాత రూ.50 నోట్లు కూడా చెల్లుతాయని ఆర్‌బీఐ మంగళవారం ప్రకటించింది.   

మరిన్ని వార్తలు