సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 143 పాయింట్లుకు పైగా నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయింది. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోకి జారుకున్నాయి. కానీ అంతలోనే ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు మార్కెట్లకు ఊతమిచ్చింది. దీంతో సెన్సెక్స్ 100 పాయింట్లు ఎగిసి 39వేల ఎగువకు చేరింది. నిప్టీ 11600 స్థాయి చేరువలో ఉంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్, కోల్ఇండియా టాప్ విన్నర్స్గా కొనసాగుతున్నాయి. యస్బ్యాంకు, టాటా మోటార్స్, వేదాంతా, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు, ఎండ్ ఎండ్ కోటక్ మహీంద్ర బాగా నష్టపోతున్నాయి.