సీతాఫలాల కోసం వెళ్లి..

13 Oct, 2016 18:48 IST|Sakshi

పెద్దవంగర (వరంగల్) : సీతాఫలాలు తెంపడానికి వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన సంఘటన పెద్దవంగర మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ధారావత్ జీవన్(11) స్నేహితులతో కలిసి సీతాఫలాలు కోసేందుకు చెట్టెక్కాడు. పక్కనే ఉన్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో కరెంట్‌ షాక్‌కు గురై మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

>
మరిన్ని వార్తలు