కర్నూలు(హాస్పిటల్): జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా జన చైతన్య అవగాహన, సర్వే కార్యక్రమాలు నిర్వహణ కోసం యువ ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రూరల్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ రహమతుల్లా శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 32 సంవత్సరాల వయస్సు కలిగి, ఇంటర్, డిగ్రీ చదివి ఉండాలన్నారు. ఎంపికైన వారికి జీతం 8వేల నుంచి రూ.10వేల వరకు ఉంటుందన్నారు. ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. వివరాలకు 95533221166, 9553259970, 83400886882 నంబర్లకు సంప్రదించాలని కోరారు.