శ్రీరాంసాగర్‌కు తగ్గిన వరద

30 Sep, 2016 11:24 IST|Sakshi

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి తగ్గింది. ప్రాజెక్ట్‌పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వదర తగ్గడంతో ప్రస్తుతం ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో కూడా 50 వేల క్యూసెక్కులు స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలో 90 టీఎంసీల నీరు ఉంది.

 

మరిన్ని వార్తలు