రైలు ఢీకొని వ్యక్తి మృతి

12 Sep, 2016 20:38 IST|Sakshi
రైలు ఢీకొని వ్యక్తి మృతి
బీబీనగర్‌:
రైలు ఢీకొన ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన  మండలంలోని కొండమడుగు మెట్టు వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గ్రామానికి చెందిన బోనస్‌ శివప్రసాద్‌(36) కుటంబ సభ్యులతో కలిసి కొండమడుగు మెట్టు వద్ద నివాసముంటున్నాడు. బతుకుదెరువు కోసం హమాలీ పని చేస్తున్న శివప్రసాద్‌ ఆదివారం రాత్రి మెట్టు సమీపంలోని రైలు పట్టాలను దాటుతున్నాడు. ఈక్రమంలో  గుర్తు తెలియని రైలు ఢీకొట్టి వెళ్లిపోయింది. స్థానికుల సమాచారం మేరకు సోమవారం ఘటన స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.
 
మరిన్ని వార్తలు