చికిత్సపొందుతూ వ్యక్తి మృతి

9 Aug, 2016 22:21 IST|Sakshi

చెన్నకేశ్వాపురం(నడిగూడెం): నిమ్మతోట ప్రహారీగా ఉన్న రాతి స్తంభం మీద పడడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. మండల పరిధిలోని చెన్నకేశ్వాపురం గ్రామానికి చెందిన తంగెళ్ల వెంకన్న(42) ఈ నెల ఏడో తేదీన తన నిమ్మ తోట వద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ప్రహారీగా ఉన్న రాతి స్తంభం మీద పడడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. చికిత్స కోసం ఖమ్మంకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
 

>
మరిన్ని వార్తలు