ఇందిరాపార్క్ వద్ద పేపర్ మిల్లు కార్మికులు ధర్నా

6 Sep, 2015 11:00 IST|Sakshi

ఆదిలాబాద్ : మూసివేసిన సిర్పుర్ పేపర్ మిల్లు వెంటనే తెరిపించాలని ఆ సంస్థ కార్మికులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 11 నెలలుగా మూసివేసిన పేపర్ మిల్లు తిరిగి తెరిపించాలని కోరుతూ మిల్లు కార్మికులు ఆదివారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు.

ఆ ధర్నాలో కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ ధర్నాతో ఇందిరాపార్క్ పరిసర ప్రాంతం జనంతో కిటకిటలాడుతుంది. పేపర్ మిల్లు కార్మికుల చేపట్టిన ఈ ధర్నాకు వామపక్షాలు, తెలుగుదేశం, కాంగ్రెస్ మద్దతు ప్రకటించాయి.

మరిన్ని వార్తలు