ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

20 Oct, 2016 18:17 IST|Sakshi

అల్లాదుర్గం (మెదక్) : ఈతకు వెళ్లిన విద్యార్థి నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేవెళ్లలో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మునిగి బీరప్ప(16) సాయంత్రం ఈతకు వెళ్లి బావిలో మునిగి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాన్ని బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు