తవ్వకాల్లో వెలుగుచూసిన బౌద్ధ అవశేషాలు

28 Feb, 2016 08:34 IST|Sakshi

విశాఖ జిల్లా మాడుగుల మండలం వొమ్మల పంచాయతీ పరిధిలోని ఉర్లోవకొండ సమీపంలో బౌద్ధ అవశేషాలు బయటపడ్డాయి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పది మంది సభ్యుల బృందం ఇక్కడ రెండు రోజులుగా తవ్వకాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శనివారం రాత్రి ఓ రెండు అడుగుల విగ్రహం, చిన్న చిన్న రాళ్లు, పాత్రలు లభ్యమైనట్టు పురావస్తు శాఖ ఏడీ చిట్టిబాబు తెలిపారు. సుమారు 5 మీటర్ల లోతు తవ్వకాలు జరపగా, మరో 20 మీటర్ల మేర తవ్వకాలు జరపనున్నట్టు ఆయన చెప్పారు.

 

మరిన్ని వార్తలు