నేటి నుంచి ఢిల్లీలో ఐసీఎస్‌ఐ కన్వెన్షన్

17 Dec, 2015 02:42 IST|Sakshi

హైదరాబాద్: కంపెనీ సెక్రటరీలకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఐసీఎస్‌ఐ 43వ జాతీయ కన్వెన్షన్ నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. మేక్ ఇన్ ఇండియా థీమ్‌తో 3 రోజుల పాటు ఈ కన్వెన్షన్‌ను ఢిల్లీలో నిర్వహిస్తామని ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) ఒక ప్రకటనలో తెలి పింది. వ్యాపారాలు సులభంగా నిర్వహించడం, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, డిజిటల్ ఇండియా తదితర అంశాలపై సమావేశాల్ని నిర్వహిస్తామని ఐసీఎస్‌ఐ ప్రెసిడెంట్ అతుల్ హెచ్  మోహతా పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు