ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

23 Feb, 2016 12:34 IST|Sakshi

అనంతపురం జిల్లా కదిరి శివారులో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఐదు ఎర్రచందనం దుంగలను, మూడు మోటార్‌సైకిళ్లు, రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నారాయణ, అమరేందర్‌రెడ్డి, చిన్నయ్య, శంకరప్ప, వెంకటరమణ, కార్తీక్‌లను అరెస్ట్ చేసి అర్బన్ స్టేషన్‌కు తరలించారు.

 

మరిన్ని వార్తలు