అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి

Published Tue, Feb 23 2016 12:28 PM

The boy died in suspicious circumstances

దంపతుల మధ్య గొడవల నేపథ్యంలో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలం శూన్యపహాడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సభావట్ బాబు, అరుణ దంపతులకు ఒక కుమారుడు గణేష్(6) ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.
సోమవారం సాయంత్రం గణేష్ ఆడుకునేందుకు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు వెదికినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం గ్రామ సమీపంలోని రోడ్డుపక్కన విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు. బాలుడి ఒంటిపై గాయాలున్నాయి. ఎస్సై డి.వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దంపతుల మధ్య గొడవల కారణంగానే గణేష్‌ను ఎవరో కొట్టి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు.

 

Advertisement
Advertisement