ఆఫ్ఘాన్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతం

18 Mar, 2018 10:16 IST|Sakshi

కాబూల్‌ : హస్కామినా జిల్లా సమీపంలో జరిపిన వైమానిక దాడిలో ఐసిస్‌కు చెందిన ఆరుగురు టెర్రరిస్ట్‌లు హతమైనట్లు  ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన 24గంటల్లో 33మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దాడిలో ఇద్దరు అధికారులు కూడా గాయపడ్డారని తెలిపింది. కాబూల్‌ పీడీ9 లో జరిగిన  కారు బాంబు ఆత్మాహుతి దాడిలో ముగ్గురు మరణించారు. అయితే ఈ ఘటనలపై ఐసిస్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు.

మరిన్ని వార్తలు