బస్సు లోయలో పడి ఆరుగురు మృతి

4 Feb, 2020 16:50 IST|Sakshi

గువాహటి : అసోంలో మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గోల్‌పారా జిల్లాలోని రాంగ్‌జూలీ సమీపంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దుబ్రి నుంచి గువాహటి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు