సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో రాజ్భవన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో 10మందికి మంత్రులుగా ఛాన్స్ దక్కనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 22న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యేలోపే కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కేబినెట్లో ఎవరెవరు ఉండాలనే విషయంలో అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనుంది. అలాగే మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా పదవుల కేటాయింపు కీలకం కానుంది. మరోవైపు సోమవారం తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.