నరేంద్ర మోదీ వల్లే నా ఓటమి 

31 May, 2019 10:39 IST|Sakshi

మాజీ ఎంపీ వినోద్‌కుమార్

సాక్షి, కరీంనగర్‌ : ప్రధాని నరేంద్ర మోదీ హవా వల్లే తాను ఓడిపోయినట్లు భావిస్తున్నానని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ప్రజల తీర్పు శిరోధార్యమని,  ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పు ఇచ్చారో సమీక్షించుకుంటున్నామని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగిందని చెప్పారు. రాబోయే రోజుల్లో బీజేపీ విధానాలపై తాము స్పందిస్తామని తెలిపారు. తమ అతి విశ్వాసం కూడా కొంత దెబ్బతీసినట్లు భావిస్తున్నామని, జరిగిన లోపాలను రాబోయే రోజుల్లో సవరించుకుంటామన్నారు. పదవులపై ఆశతో తాను రాజకీయాల్లోకి రాలేదని, కేవలం ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న ఆశయంతో వచ్చానని పేర్కొన్నారు.

 తెలంగాణ రాష్ట్ర సాధనతోనే టీఆర్ఎస్ ఉద్యమం ముగియలేదన్నారు. సమస్యలు పరిష్కారమయ్యేదాకా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణ ప్రజల సమస్యల కోసం పనిచేస్తూనే ఉంటానని చెప్పారు. తాను ఓడినప్పటికి కరీంనగర్ నియోజక వర్గ ప్రజల సేవలోనే ఉంటానన్నారు. గెలుపు ఓటములు సమానంగా చూడాలని కార్యకర్తలను కోరారు.

మరిన్ని వార్తలు