-

నేటి నుంచి ఐఎస్‌ఎల్ సెమీస్

11 Dec, 2015 02:14 IST|Sakshi
నేటి నుంచి ఐఎస్‌ఎల్ సెమీస్
తొలి అంచెలో ఢిల్లీ, గోవా పోరు
 న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్‌లో సెమీస్ అంకానికి తెర లేచింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన గోవా, నాలుగో స్థానంలో నిలిచిన ఢిల్లీల మధ్య జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నేడు మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు జట్ల మధ్య రెండో అంచె సెమీస్‌న 15న జరుగుతుంది. మరోవైపు చెన్నైయిన్, కోల్‌కతాల మధ్య తొలి అంచె సెమీస్ రేపు పుణేలో జరుగుతుంది. ఐఎస్‌ఎల్‌లో ఇప్పటివరకూ ఢిల్లీ జట్టు గోవాపై ఎప్పుడూ గెలవలేదు. లీగ్ దశలో గోవా అత్యధిక గోల్స్ (29) చేయగా ఢిల్లీ ప్రస్తుతం సెమీస్‌కు చేరిన జట్లలో అత్యల్ప (18) గోల్స్ సాధించింది.
 
 స్టార్ స్పోర్ట్స్-2లో 
 రాత్రి 7 నుంచి ప్రత్యక్ష ప్రసారం
 
మరిన్ని వార్తలు