విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్: విజయనగరంలో తొలిసారి ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది.
భారత్, శ్రీలంక మహిళల మూడు టి20ల సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్లు... ఇక్కడి ఏసీఏ నార్త్జోన్ క్రికెట్ అకాడమీ మైదానంలో నిర్వహిస్తున్నారు. శనివారం, ఆదివారం రెండు మ్యా చ్లు ఉదయం 10 గంటల నుంచి జరుగుతాయి. మూడో మ్యాచ్ 28న వైజాగ్లో జరుగుతుంది.