హరారే: జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్న టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్.. అన్ని ఫార్మాట్లలో సత్తా చాటుతానని విశ్వాసం వ్యక్తం చేశాడు. 'ప్రతీ ఫార్మాట్లో రాణించడంపైనే దృష్టి పెట్టా. గత కొన్ని నెలల నుంచి నా ప్రదర్శన నా బాగుంది. ఐపీఎల్లో ఆర్సీబీ జట్టుకు ఆడుతున్నప్పుడు భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. నాపై ఉంచిన నమ్మకాన్ని నిరూపించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగిస్తా' అని రాహుల్ పేర్కొన్నాడు.
జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో 196 పరుగులు చేసిన రాహుల్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కింది. తొలి వన్డేలో శతకం చేయగా, మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో మెరిశాడు.