ఆర్సీబీ-నైట్ రైడర్స్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి

7 May, 2017 17:44 IST|Sakshi
ఆర్సీబీ-నైట్ రైడర్స్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి

బెంగళూరు: కోల్ కోత్ నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆదివారం ఇక్కడ జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది.  ఆర్సీబీ 14.1 ఓవర్లలో 100/3 వద్ద ఉండగా వర్షం పడింది. దాంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేయకతప్పలేదు.

 

వర్షం కారణంగా మ్యాచ్ ను నిలిచిపోయే సమయానికి మన్ దీప్ సింగ్(48 నాటౌట్),  ట్రావిస్ హెడ్(35 నాటౌట్) క్రీజ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన బెంగళూరు ముందుగా బ్యాటింగ్ కు దిగింది. బెంగళూరు టాపార్డర్ ఆటగాళ్లలో క్రిస్ గేల్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కోహ్లి(5), ఏబీ డివిలియర్స్(10)లు తీవ్రంగా నిరాశపరిచారు.

మరిన్ని వార్తలు