ఇక శ్రీలంకతో చావో రేవో

15 Jan, 2015 19:43 IST|Sakshi
టీమిండియా

సెల్‌కాన్ ముక్కోణపు టోర్నీలో తుది పోరుకు చేరుకోవాలంటే భారత జట్టు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యం లో మంగళవారం తమ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టుతో ఆడనుంది.

ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే కోహ్లి సేన ఫైనల్‌కు చేరే అవకాశాలు ఉంటాయి. వరుసగా రెండు ఓటములు ఎదురై ఇబ్బందికర పరిస్థితుల్లో పడిన భారత్.. వెస్టిండీస్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో దుమ్ము రేపి ట్రాక్‌లోకి వచ్చింది.

బోనస్ పాయింట్ సంపాదించి ఒక్కసారిగా రేసులో తామూ ఉన్నామని చాటుకుంది. అయితే నేటి మ్యాచ్‌లో మాత్రం భారత్ కచ్చితంగా నెగ్గాల్సి ఉంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి రావడం లంకను కొద్దిగా ఆందోళనపరిచే విషయమే. వారి అలసటను భారత్ సొమ్ము చేసుకుంటే ఫలితం దక్కుతుంది.

మరిన్ని వార్తలు