-
కరాచీ: భారత్లో ఈనెల 8 నుంచి 18 వరకు జరిగే జూనియర్ ప్రపంచ కప్ హాకీ టోర్నమెంట్ నుంచి పాకిస్తాన్ జట్టును అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) తప్పించింది. పాక్ స్థానంలో మలేసియా జట్టుకు స్థానం కల్పించారు.
నిర్ణీత వ్యవధిలోపు వీసాల కోసం పాక్ జట్టు దరఖాస్తు చేయకపోవడంతో ఎఫ్ఐహెచ్ ఈ నిర్ణయం తీసుకుంది. అరుుతే ఎఫ్ఐహెచ్ తీసుకున్న నిర్ణయం అర్థంపర్థంలేనిదని పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) విమర్శించింది.