టి20 సిరీస్ గెల్చుకున్న పాకిస్థాన్

29 Jul, 2013 12:40 IST|Sakshi
టి20 సిరీస్ గెల్చుకున్న పాకిస్థాన్

వెస్టిండీస్తో జరిగిన రెండు టి20ల సిరీస్ను పాకిస్థాన్ 2-0తేడాతో గెల్చుకుంది. ఆదివారం విండీస్తో జరిగిన రెండో టి20లో పాక్ 11 పరుగులతో విజయం సాధించింది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విండీస్కు వరుసగా రెండో ఓటమి తప్పలేదు.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. అక్మల్(46), షెహజాద్(44) రాణించారు. విండీస్ బౌలర్లలో నరైన్ 3, బద్రీ 2 వికెట్లు పడగొట్టారు. స్యామీ, పొలార్డ్ చెరో వికెట్ తీశారు.

136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 124 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో తన్వీర్, జుల్ఫికర్ బాబర్, అజ్మాల్ రెండేసి వికెట్లు నేలకూల్చారు. హఫీజ్, ఆఫ్రిది చెరో వికెట్ దక్కించుకున్నారు. ఉమర్ అక్మల్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', జుల్ఫికర్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అందుకున్నారు.

మరిన్ని వార్తలు