సిక్కి రెడ్డి జోడికి టైటిల్

9 Feb, 2014 00:55 IST|Sakshi

బెంగళూరు: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సిక్కిరెడ్డి-మేఘన జోడీ డబుల్స్ టైటిల్ గెలిచింది. ఫైనల్లో 21-19, 21-19తో  టాప్‌సీడ్ ప్రజక్తా-ఆరతి జోడీపై నెగ్గారు.
 
 మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో సిక్కిరెడ్డి-నందగోపాల్ ద్వయం 14-21, 14-21తో టాప్ సీడ్ తరుణ్ కొన (ఆంధ్రప్రదేశ్)- అశ్విని పొన్నప్ప జోడి చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల డబుల్స్ టైటిల్ పోరులో నందగోపాల్-హేమ నాగేంద్రబాబు (ఏపీ) ఓడిపోయారు. కాగా మహిళల సింగిల్స్ టైటిల్‌ను తాన్వీ లాడ్, పురుషుల టైటిల్‌ను అనూప్ శ్రీధర్ చేజిక్కించుకున్నారు.
 

మరిన్ని వార్తలు