దక్షిణాఫ్రికా 267/7

15 Jan, 2016 00:18 IST|Sakshi

 ఇంగ్లండ్‌తో మూడో టెస్టు
 జొహన్నెస్‌బర్గ్: ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా నెమ్మదిగా ఆడుతోంది. ఎల్గర్ (46), ఆమ్లా (40) ఓ మాదిరిగా ఆడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ప్రొటీస్ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 7 వికెట్లకు 267 పరుగులు చేసింది. మోరిస్ (26 బ్యాటింగ్), రబడ (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ జట్టుకు ఎల్గర్, వాన్ జెల్ (21) శుభారంభాన్నివ్వలేకపోయారు.
 
  ఇంగ్లండ్ పేసర్ల ధాటికి 44 పరుగులకే తొలి వికెట్ కోల్పోయారు. అయితే ఆమ్లా నిలకడగా ఆడి ఎల్గర్‌తో రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపర్చాడు. తర్వాత డివిలియర్స్ (36) కాసేపు ఆడే ప్రయత్నం చేసినా.. మిడిలార్డర్‌లో సహకారం కరువైంది. చివర్లో మోరిస్, రబడ వికెట్‌ను కాపాడుకుంటూ ఏడో వికెట్‌కు అజేయంగా 42 పరుగులు సమకూర్చారు.
 

మరిన్ని వార్తలు