ఇంగ్లండ్ విజయలక్ష్యం 79

30 May, 2016 19:48 IST|Sakshi
ఇంగ్లండ్ విజయలక్ష్యం 79

చెస్టర్ లీ స్ట్రీట్: మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక 79 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. 309/5 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకేయులు 475 పరుగుల వద్ద ఆలౌటయ్యారు.  ఆదివారం హాఫ్ సెంచరీతో అజేయంగా క్రీజ్లో ఉన్న దినేష్ చండిమల్ ఈరోజు శతకం సాధించాడు. చండిమాల్(126;207 బంతుల్లో13 ఫోర్లు, 1సిక్స్) తో రాణించాడు. అనంతరం రంగనా హెరాత్(61; 99 బంతుల్లో 8 ఫోర్లు)హాఫ్ సెంచరీతో మెరవడంతో శ్రీలంక ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకుంది.

 

అంతకుముందు మాథ్యూస్ (105 బంతుల్లో 80; 9 ఫోర్లు; 1 సిక్స్), కుశాల్ సిల్వ (145 బంతుల్లో 60; 6 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ ఐదు వికెట్లు సాధించగా,వోక్స్ కు రెండు, స్టువర్ట్ బ్రాడ్, ఫిన్, మొయిన అలీలకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో అండర్సన్ కు మొత్తంగా ఎనిమిది వికెట్లు దక్కాయి. తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 498/9 డిక్లేర్

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 101 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్  475 ఆలౌట్

 

మరిన్ని వార్తలు