లెజెండ్స్ ఇద్దరూ.. ఒకే చోట

4 Feb, 2014 15:03 IST|Sakshi
లెజెండ్స్ ఇద్దరూ.. ఒకే చోట

న్యూఢిల్లీ: ఒకరు ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మన్. మరొకరు గోల్ఫ్ మేటి. ఈ దిగ్గజాలు తొలిసారి ఒకే చోట దర్శనమిచ్చారు. ఈ అరుదైన సన్నివేశానికి ఢిల్లీ వేదికైంది. వారిద్దరే టీమిండియా బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్.. అమెరికా స్టార్ గోల్ఫర్ టైగర్ వుడ్స్.

భారత పర్యటనకు వచ్చిన వుడ్స్ మంగళవారం ఓ హోటల్లో సచిన్, అతని కుటుంబ సభ్యుల్ని కలిశాడు. ఈ విషయాన్ని వుడ్స్ ట్విట్టర్లో వెల్లడించాడు. 'సచిన్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ప్రేమ పూర్వకంగా స్వాగతం పలికాడు' అని వుడ్స్ ట్వీట్ చేశాడు. ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం వుడ్స్ ఢిల్లీకి రాగా, మంగళవారం భారతరత్న అవార్డు స్వీకరించేందుకు ఢిల్లీకి వచ్చాడు. మాస్టర్కు గోల్ఫ్ అంటే చాలా ఇష్టం.

మరిన్ని వార్తలు