విరాట్, అనుష్క ఫొటోలు వైరల్

20 Aug, 2017 16:05 IST|Sakshi
విరాట్, అనుష్క ఫొటోలు వైరల్

దంబుల్లా: గత కొన్నేళ్లుగా భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. వీరు ఎక్కడ కనిపించినా అది అభిమానులకు పెద్ద విశేషమే.  తాజాగా వీరిద్దరూ కలిసి లంకలో విహరిస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. శ్రీలంకలోని అలియా రిసార్ట్ అండ్ స్పాలో విరాట్, అనుష్కలు కలిసి చెట్టు నాటారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం భారత జట్టు ఐదు వన్డేల సిరీస్ కు సన్నద్ధమైంది. టెస్టు సిరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసిన విరాట్ సేన.. ఇప్పుడు వన్డే సిరీస్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం విరాట్ వెంటే అనుష్క శర్మ ఉన్నారు. ఈ మేరకు ఇద్దరు కలిసి విహరిస్తూ మరోసారి సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు. లంకలో గో గ్రీన్ సందేశాన్ని ఇచ్చే క్రమంలో ఈ జోడి మరోసారి వార్తల్లోకి వచ్చింది.

మరిన్ని వార్తలు