ఆలయ కోనేరులో మృతదేహం

12 Feb, 2016 16:32 IST|Sakshi

మల్యాల : కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ కోనేరులో ఓ మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం వెలుగు చూసింది. కోనేరును శుభ్రం చేస్తుండగా.. సుమారు 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతదేహం బయటపడింది. వ్యక్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు