చోటా రాజన్‌పై సీబీఐ తొలి చార్జిషీటు

3 Feb, 2016 03:47 IST|Sakshi
చోటా రాజన్‌పై సీబీఐ తొలి చార్జిషీటు

న్యూఢిల్లీ: నకిలీ పాస్‌పోర్టు కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌పై తొలి చార్జిషీట్‌ను సీబీఐ మంగళవారం దాఖలు చేసింది. రాజన్ సహా ముగ్గురు మాజీ పాస్‌పోర్టు ఉద్యోగులనూ నిందితులుగా పేర్కొంది. బెంగళూరు పాస్‌పోర్టు ఆఫీసుఉద్యోగులు రాజన్‌కు తప్పుడు అడ్రస్‌తో పాస్‌పోర్టు మంజూరవడానికి  సాయపడ్డారని  సీబీఐ పటియాలా హౌస్ కోర్టులో వె ల్లడించారు.

మరిన్ని వార్తలు