సాక్షి, పాడేరు: జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు కలెక్టర్ సుమిత్కుమార్తో పాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హిందువులు దీపావళిని అత్యంత పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు. దీపావళి పండగ జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఎస్పీ తుహిన్సిన్హా, జేసీ శివశ్రీనివాస్, పాడేరు.రంపచోడవరం ఐటీడీఏ పీవోలు అభిషేక్, సూరజ్ గనోరే, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, నాగులపల్లి ధనలక్ష్మి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.