ఝమ్మని దూసుకుపోయిన జియో లాభాలు

6 May, 2022 19:14 IST|Sakshi

రిలయన్స్‌ జియో 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో లాభాల్లో దూసుకుపోయింది. గతేడాది ఇదే క్వార్టర్‌ లాభాలతో పోల్చితే ఈసారి 15.4 శాతం అధిక లాభాలను సాధించింది. తాజాగా ప్రకటించిన క్వార్టర్‌ 4 ఫలితాల్లో రూ. 20,901 కోట్ల రెవిన్యూపై రూ. 4,173 కోట్ల లాభాలను సాధించింది. అయితే గతేడాది ఇదే కాలానికి ఫలితాలతో పోల్చితే రెవిన్యూ పెరగగా లాభాలు తగ్గాయి. ఇక ఆపరేటింగ్‌ ప్రాఫిట్స్‌ విషయానికి వస్తే ఈ క్వార్టర్‌లో రూ.10,510 కోట్ల లాభాలు రాగా అంతకు ముందు ఏడాది ఈ సంఖ్య 9,514 కోట్లుగా ఉంది.

చదవండి: Telecom Service: టెలికాం సంస్థలకు భారీ షాక్‌! తగ్గిన స్థూల ఆదాయం!

మరిన్ని వార్తలు