ఉదయనిధి స్టాలిన్‌ ఫౌండేషన్‌ ఆస్తుల అటాచ్‌

28 May, 2023 04:27 IST|Sakshi

న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి నడిపే ఫౌండేషన్‌కు చెందిన రూ.36 కోట్ల ఆస్తుల్ని అటాచ్‌ చేసినట్లు ఈడీ తెలిపింది. మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా ఫౌండేషన్‌కు చెందిన తమిళనాడులోని రూ.36 కోట్ల విలువైన స్థిరాస్తులను, రూ.34.7 లక్షల బ్యాంక్‌ డిపాజిట్లను ఈనెల 25న అటాచ్‌ చేసినట్లు వివరించింది.

ఈ కేసు దర్యాప్తులో కల్లాల్‌ గ్రూప్, యూకే కేంద్రంగా పనిచేసే లైకా గ్రూప్‌ అనుబంధంగా భారత్‌లోని లైకా ప్రొడక్షన్స్, లైకా హోటల్స్‌లో సోదాలు జరిపినట్లు తెలిపింది. 

మరిన్ని వార్తలు