మల్కన్గిరి: జిల్లాలోని ఎంవీ 3 గ్రామం వద్దనున్న బీఎస్ఎఫ్ క్యాంప్ కార్యాలయం నుంచి శనివారం 20 మంది గిరిజన యువతకు చండీఘర్ḥ ప్రయాణానికి అవకాశం కల్పించారు. బీఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మత్తిలి సమితి పరిధిలో ఉన్న పలు గిరిజన గ్రామాల యువతకు ప్రపంచం గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో టూర్కు తీసుకెళ్లారు.
దీనిలో భాగంగా ఈనెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు యువతకు బీఎస్ఎఫ్ అధికారులే పూర్తి ఖర్చులతో ముఖ్యమైన ప్రదేశాలు, సినీ, రాజకీయ నేతలను చూపిస్తారు. వీరితో పాటు నలుగురు జవాన్లు ఉంటూ సౌకర్యాలు కల్పిస్తారని జిల్లా బీఎస్ఎఫ్ డీఐజీ ఎస్కే సిన్హా, జిల్లా నెహ్రూ యువకేంద్రం సెక్రటరీ సంతోష్ పాత్రో తదితరులు తెలియజేశారు.