విజయనగరంలో ఎస్పీ వాహనం ధ్వంసం, గాల్లోకి కాల్పులు

4 Oct, 2013 13:10 IST|Sakshi

రాష్ట్ర విభజనపై నోట్ను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడాన్ని నిరసిస్తూ విజయనగరంలో  నిర్వహిస్తున్న బంద్ తీవ్ర ఉద్రికత్త పరిస్థితులకు దారితీసింది. శుక్రవారం ఉద్యమకారులు ఎస్పీ వాహనాన్ని తగులబెట్టారు. డీఎస్పీ వాహనాన్నీ ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు ఐదు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. విద్యార్థులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి తరలివచ్చి నిరసన తెలిపారు.

అంతకుముందు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చెందిన కళాశాల,లాడ్జీపై విద్యార్థులు రాళ్ల దాడి చేశారు. కళాశాల కిటికి అద్దాలు పగలగా, లాడ్జీలోని ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమైంది. విద్యార్థుల రాళ్ల దాడిని పోలీసులు అడ్డుకుని వారిపై లాఠీ చార్జ్ చేశారు. కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి.

మరిన్ని వార్తలు