దారుణం: మంచానికి కట్టేసి తగలబెట్టారు!

18 Jan, 2020 13:25 IST|Sakshi

లక్నో : మంచానికి కట్టిపడేసి ఉన్న గుర్తు తెలియని మహిళ మృతదేహం శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో లభ్యమైంది. బిజ్నూర్‌ జిల్లాలోని గజ్రోలా అనే గ్రామంలోని మామిడితోటలో పూర్తిగా కాలిపోయి ఉన్న మహిళ శవాన్ని పోలీసులు గుర్తించారు.అస్థిపంజరం మాత్రమే కనిపించేలా పాశవికంగా ఆమెను తగులబెట్టారని పేర్కొన్నారు. తోటమాలి అందించిన సమాచారం మేరకు... వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిలో రెండు తుపాకీ గుండ్లు లభ్యమయ్యాయని.. అందులో ఒకటి బాధితురాలిపై ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళను తుపాకీతో కాల్చి చంపి.. అనంతరం తగల బెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఘటన జరిగిన మామిడితోట నోయిడాకు చెందిన వ్యక్తిదని పోలీసులు తెలిపారు. అయితే మృతి చెందిన మహిళ ఎవరనే విషయంపై ఇంతవరకు స్పష్టత రాలేదని.. ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. 

>
మరిన్ని వార్తలు