ఆరు రోజులుగా తాగునీరు బంద్‌

18 Jul, 2016 18:14 IST|Sakshi
బోరు వద్ద నీళ్ల కోసం క్యూ
కె.కొత్తపల్లి గ్రామంలో ఆరు రోజుల నుంచి తాగునీటి సరఫరా బంద్‌ అయ్యింది. ఆలూరు శివారులో ఉన్న సంప్‌ నుంచి ఈ గ్రామానికి తాగునీటి సరఫరా కావాల్సి ఉంది. సంప్‌ వద్ద తాత్కాలికంగా పని చేస్తున్న వర్కర్‌ ఇటీవల విధుల నుంచి తప్పుకొన్నాడు.


అతని స్థానంలో మరొకరిని నియమించే విషయంలో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామస్తులు పొలాలకెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామన్నారు. అధికారులు స్పందించి తాగునీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

>
మరిన్ని వార్తలు