'ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం'

12 Feb, 2016 13:50 IST|Sakshi

విజయవాడ: తాను పార్టీ మారుతున్నట్టు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని వైఎస్సార్ సీపీకి చెందిన కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధి మండిపడ్డారు. టీడీపీలో చేరాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.

తన నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి, మంత్రులను కలిసినట్టు చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు